రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ నాయకుని కుటుంబానికి ఆర్థిక సహాయం
ఐఎన్ బి టైమ్స్, జనవరి 26, వెల్దుర్తి.:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలంలోని రచ్చ మల్లపాడు గ్రామానికి చెందిన జనసేన నాయకులు బేతం శెట్టి పెద్ద కొండలు గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రోజు వారి కుటుంబానికి నాదెండ్ల మనోహర్ చేతుల మీద 5 లక్షల రూపాయల చెక్కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల జనసేన పార్టీ సమన్వయ కర్త బూసా రామాంజనేయులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి మరియు వెల్దుర్తి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గంధం మల్లయ్య, ఉపాధ్యక్షుడు తోట శ్రీను, గ్రామ అధ్యక్షుడు దండే రాజా, వాలంటీరు గుర్రాల మణి, చింతల మణి, రంగారావు, వెంకయ్య, అంజి పాల్గొన్నారు. గంధం మల్లయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ అని మరియు పవన్ కళ్యాణ్ కార్యకర్తల మంచి కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు. వెల్దుర్తి మండలంలోని ప్రతి జనసేన కార్యకర్త జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు
Comment List