ఎస్సీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: కట్ట రాయప్ప
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 03:
బడ్జెట్లో రూ.20 వేల కోట్లు నిధులు కేటాయింపుపై హర్షం
సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే జూలకంటితోనే దళితుల అభివృద్ధి సాధ్యం
ఎస్సీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మాచర్ల మండలం విజయపురిసౌత్ టీడీపి సీనియర్ నేత,మాల మహానాడు నాయకులు కట్ట రాయప్ప అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దళితుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాష్ట్ర బడ్జెట్లో రూ.ఇరవై వేల కోట్లకు పైగా నిధులు కేటాయించడం హర్షనీయం అన్నారు. కేటాయింపు నిధుల ద్వారా దళితుల ఆర్థిక అభివృద్ధి సాకారం అవుతుందన్నారు. దళితుల ఆర్థిక అసమానతలను గుర్తించిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లపై దళితులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.అలాగే మాచర్ల నియోజకవర్గంలోని దళితుల పక్షపాతి, తమ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారు.దళితుల అభివృద్ధి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిలతోనే సాధ్యమన్నారు.
Comment List