బీజేపీ గెలుపు  దుర్గిలో సంబరాలు..!!

బీజేపీ గెలుపు  దుర్గిలో సంబరాలు..!!

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 08:పల్నాడు జిల్లా, దుర్గి మండలం,ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు పూర్తయింది. ఎన్నికల ఫలితాలలో భాగంగా బిజెపి అఖండ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్బంగా మండలకేంద్రమైన దుర్గిలో బిజెపి నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని అని బిజెపి పార్టీ సీనియర్ నాయకులు వెలిదండి శ్రీనివాసరావు అన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు పులి హరి  మాట్లాడుతూ మన దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి పార్టీ విజయం అన్ని రాష్ట్రాలకి బలమైన శక్తిగా నిలుస్తుందిన్నారు. ఈ సందర్బంగా కూటమి నాయకులు స్వీట్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బి సి మహిళా మోర్చా జిల్లా నాయకురాలు గంజర్ల  లక్ష్మీ, ఎస్సీ మోర్చా నాగేండ్ల మరియదాస్, టిడిపి పట్టణ అధ్యక్షులు పగడాల చెన్నకేశవులు, తెలుగు యువత సింగు నాగేశ్వరరావు, సూరె కృష్ణ,జనసేన పట్టణ అధ్యక్షులు రుద్రాల రవి కప్పెర పెద్దిరాజుమరియుకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 7

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...