పెన్షనర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : జూలకంటి బ్రహ్మానందరెడ్డి

పెన్షనర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 22 :పెన్షనర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. శనివారం మాచర్ల పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవన్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయంలో పెన్షన్ పై ఆధారపడి జీవించే వారిని అనేక ఇబ్బందులకు గురి చేశారని సకాలంలో పెన్షన్ అందక మానసిక ఇబ్బందులకు గురయ్యారని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ను గత పాలకులు చిన్నాభిన్నం చేసినప్పటికీ పెన్షనర్ల కు సకాలంలో వారి ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని అన్నారు. పెన్షన్ దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా వారి యొక్క బాగుఓగులు చూసుకుంటున్నాడని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అనేక పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పెన్షన్ దారులకు పిలుపునిచ్చారు. ఈనెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మద్దతుగా నిలిచి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు.

Tags:
Views: 5

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...