కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...
ఐ న్ బి టైమ్స్ ప్రతినిధి మార్చి 06:పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరముల లోపు పిల్లలకి పోలియో చుక్కలు మరియు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. వారంలో ప్రతి బుధవారం మరియు శనివారం రోజులలో తప్పనిసరిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఏఎన్ఎం రాజేశ్వరి తెలిపారు ఈ కార్యక్రమానికి పోరుమామిళ్ల పట్టణం మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ పాల్గొన్నారు. చిన్నపిల్లలకు పోలియో చుక్కలను సర్పంచ్ యనమల సుధాకర్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఐదు సంవత్సరంలోపు చిన్నపిల్లల అందరికీ పల్స్ పోలియో చుక్కలు మరియు టీకాలు తప్పనిసరిగా వేయించాలన్నారు. ఈ టీకాలు వేయడం వలన పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందన్నారు. పోలియో, క్షయ, కోరింత దగ్గు, ధనుర్వాతము, తట్టు, కామెర్లు, మెదడువాపు వంటి వ్యాధులు రాకుండా రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాజేశ్వరి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీ ప్రియ, ఆశా కార్యకర్తలు, వీఆర్వో ప్రతాప్, పంచాయతీ సెక్రెటరీ చెన్నకేశవరెడ్డి, చిన్న పిల్లల తల్లులు పాల్గొన్నారు
Comment List